Recent Posts

April 6, 2019





https://www.youtube.com/channel/UCJKI_07UStnvX2ty6wFbKiA?sub_confirmation=1

December 19, 2017




కర్నూల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఫేస్ బుక్ పేజిలు

May 20, 2014

Erratic power supply and untimely rains delivered deadly blows on the cash crops and horticultural crops, crippling the farmers financially. Loan waiver will reduce the burden on the farmers and bring them back on the path of prosperity.

Promises that rebuild lives

న్యూఢిల్లీ, మే 20 : దేశంలో కొత్తశకం ప్రారంభమైందని, దేశానికి ఈరోజు శుభదినమని, నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం దేశానికి శుభశూచకమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో ఏపీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుపరిపాలన కోసం దేశం ఎదురుచూస్తోందని అన్నారు. భారీ మెజార్టీతో మోదీ గెలుస్తారని ముందే చెప్పానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
యూపీఏ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. యూపీయే పదేళ్ల పరిపాలనలో అవినీతి పెరిగిందని, యూపీఏపై కోపంతో ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టారని ఆయన అన్నారు. రెండు సార్లు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని ఆయన అన్నారు. ఎన్డీయేలో చేరుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సామాజిక తెలంగాణ టీడీపీ లక్ష్యమని, అందుకు సహకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీయే హయంలో రెండు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, హైదరాబాద్‌లోని తెలుగువారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరి సహకారం కావాలని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని నరేంద్రమోదీ ముందే చెప్పారని చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఆం«ధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, అన్నీ పట్టణాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటామని నేను, మోదీ హామీ ఇచ్చామని, ఈ హామీల అమలుకు కృషి చేస్తానని ఆయన వాగ్ధానం చేశారు. విభజనతో రాష్ట్రాన్ని పెనం నుంచి పొయ్యిలో పడేశారని కాంగ్రెస్‌నను బాబు దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదని ప్రశ్నిస్తే... తనవి రెండు కళ్ల సిద్ధాంతమని కొందరు ఎగతాళి చేశారని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడనేది నిర్ణయిం
చకుండా ఎలా విభజన చేస్తారని చంద్రబాబు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అవినీతి రహిత దేశం కోసం కృషి చేస్తామని, వ్యక్తులను కాదు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రమాణస్వీకారం చేస్తానని, ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తానని ఆయన అన్నారు. పరిపాలన ఏపీ నుంచే మొదలు పెడతానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతున్నాం : బాబు

గవర్నర్‌ని కలవటానికి చంద్రబాబు వెళ్ళినప్పుడు, ఆయనతో కలసి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలకి ‘‘మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా కష్టపడి పని చేస్తారు, ఆయనలాగా మీరు కూడా కష్టపడాలి’’ అని టిడిపి ఎమ్మెల్యే, ఎంపీలకు గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. మీరు చేతులు కలపాలని, జట్టుగా ఆయనకు సహకరించాలని సూచించారు.

ఆయనలాగా మీరు కూడా కష్టపడాలి... -నరసింహన్






slide

December 6, 2013

అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కేంద్రం గద్దెదిగి రావాలంటే ఆందోళనలు తప్పవని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా అని వారు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల జేఏసీలను సంప్రదించాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చలేదన్నారు. సమస్యలుపరిష్కరించకుండా విభజన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. కేంద్ర ఏకపక్షనిర్ణయాన్ని, జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని వారు డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్లనారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు పాల్గొన్నారు.

కేంద్రం దిగిరావాలంటే ఆందోళనలు తప్పవు

December 5, 2013


 రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేబినెట్ నోట్ చూశాకే తాము స్పందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోందని, తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా అని కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని ఆరోపించారు.

తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా

కృష్ణ జిలాలపై బ్రెజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వానికి అవగాహన లేదని, అందుకే రాష్టానికి నష్టం జరుగుతున్న ఇంతవరకు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం వస్తుందని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని, తీర్పును రద్దు చేసే విధంగా పోరాడాలని మండవ కోరారు. అలాగే దీనిపై అఖిల పక్షం కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మైనపు బొమ్మలా ఉండకుండా స్పందించి, రాష్ట్రానికి న్యాయం చేయాలని మండవ పేర్కొన్నారు. తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్ అయితే, జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తప్పు పట్టడం సరికాదని ఆయన హితవుపలికారు.

తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్

 రాయల తెలంగాణ ఎవరు అడిగారని, రాయలసీమను విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివప్రసాద్,
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయమని, ఎవరూ కోరలేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తెరపైకి తీసుకు వచ్చిందని ఆయన అన్నారు.

మరో ఎంపీ మోదుగుల మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన ఓ మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు.

మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే